అమరావతి : కామారెడ్డి జిల్లాలోని బీచ్కుంద పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుళ్లు వీ సంతోష్, బీ పరందాములు, సీహెచ్ భవిత, మైశాఖ ఇసుక లారీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఇటీవల వీరిపై ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ నిర్వహించారు. ఆరోపణలు రుజువుకావడంతో ఎస్పీ శ్వేతారెడ్డి నలుగురికి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.