హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం వెలువరించింది. జూన్ 15వ తేదీతో స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. కాగా ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని స్కూళ్లు, డైట్ కాలేజీలకు జూన్ 20వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు వెలువరించారు.