న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలావరకు తగ్గినా రోజువారీ కరోనా పరీక్షల ప్రక్రియ మాత్రం శరవేగంగా కొనసాగుతున్నది. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం రూ.60 వేలకు దిగిరాగా.. రోజూ 15 లక్షలకు తగ్గకుండా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం కూడా కొత్తగా 17,51,358 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వాటితో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 38 కోట్ల మార్కును దాటి 38,13,75,984కు చేరింది. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ మంగళవారం వెల్లడించింది.