న్యూఢిల్లీ : వేరొకరితో వివాహేతర బంధం కొనసాగిస్తుందనే అనుమానంతో కట్టుకున్న భార్యను గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా హతమార్చిన వ్యక్తి ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. ఔటర్ ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది.
అనుమానంతో భార్య(20)ను దిల్షాద్ అనే నిందితుడు ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీశాడు. భార్యను చంపిన అనంతరం దిల్షాద్ చాలా సేపు ఆమె మృతదేహం పక్కనే గడిపాడని పోలీసులు తెలిపారు. నిందితుడు దిల్షాద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.