హైదరాబాద్ : దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాఘవమ్మ (97) ఇవాళ కన్నుమూత మూశారు. వయోభార అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమాజిగూడలోని తన స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ మృతితో ఆమె స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాఘవమ్మ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.