న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.339 తగ్గి రూ.48,530కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం 24 క్యారట్ బంగారం ధర 48,860 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహల ధరలు కొద్దిగా పడిపోవడమే దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.475 తగ్గి రూ.70,772కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.71,247 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,893 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.79 అమెరికన్ డాలర్లు పలికింది.