హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్, విజయవాడ క్యాంపస్లలో ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం రెండు దశల్లో నిర్వహించిన పరీక్ష ఫలితలను వర్సిటీ వీసీ డాక్టర్ ఎన్ వెంకట్రామ్ విడుదలచేశారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చే లక్ష్యంతోనే ఏటా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది నిర్వహించిన ప్రవేశ పరీక్షలను ఆఫ్లైన్, ఆన్లైన్లో 30 వేల మంది రాశారని అన్నారు. మెరిట్ ర్యాంకులు పొందిన విద్యార్థులకు ఇంజినీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్లో స్కాలర్ షిప్ కింద ఫీజు రాయితీ ఇస్తామని వెల్లడించారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, అప్లికేషన్ నంబర్ ఆధారంగా ఫలితాలను తెలుసుకోవచ్చని చెప్పారు. మొబైల్కు కూడా ఒక లింక్ పంపిస్తున్నామని తెలిపారు. జూన్ రెండోవారంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని, దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే చేసుకోవాలని అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు సూచించారు. వర్సిటీ ద్వారా అందించే అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశాలకు కూడా జూన్ రెండోవారంలో పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు.