కరోనా అవగాహన కార్యక్రమంపై కేంద్రం, ఢిల్లీలకు హైకోర్టు సూచన
న్యూఢిల్లీ: కరోనా గురించి ప్రజల్లో అపోహలు, భయాలు నెలకొన్న నేపథ్యంలో వైరస్పై విస్తృతమైన అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ సర్కారుకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. గతంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘మనమిద్దరం.. మనకిద్దరు’లాగా విస్తృతస్థాయిలో కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపింది. నాడు కుటుంబ నియంత్రణ ప్రచారం మంచి సత్ఫలితాలను ఇచ్చిందని, దాని మాదిరే కరోనాకు సంబంధించిన విషయాలపై ప్రచార మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని సూచించింది.