రామాయంపేట, మే 23: ఇంటింటి సర్వేను సిబ్బంది పకడ్బందీగా చేపట్టాలని, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కటికె బస్తీ, అంబేద్కర్ కాలనీలలో సర్వే సిబ్బందితో కలిసి మెడికల్ కిట్ అందజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ సర్వేకు వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. ఎలాంటి వ్యాధులకైనా ప్రభుత్వం మెడికల్ కిట్లను తమ ఇంటికే చేరవేస్తుందన్నారు. నిర్లక్ష్యం చేయకుండా సర్వేకు సహకరించాలన్నారు. చైర్మన్ వెంట కౌన్సిలర్ అనిల్కుమార్, సిబ్బంది కాలేరు ప్రసాద్, పాతూరి సిద్దిరాములు తదితరులున్నారు.
తూప్రాన్లో జ్వరం సర్వే
తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని గామాల్లో ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు సర్వేను నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కుటుంబాల వారిగా వ్యాధి లక్షణాలను అడిగి తెలుసుకున్నా రు. కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తూనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు
చేగుంటలో…
చేగుంట, మే 23:గ్రామంలో ఎవరికైనా జ్వరం లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించాలని చేగుంట, నార్సింగి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వైద్యులు వినయ్కుమార్, డాక్టర్ రాఖేశ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని కర్నాల్పల్లి గ్రామంలో జ్వరం వచ్చిన పలువురు బాధిత కుటుంబాలకు ఆశ వర్కర్ లావణ్య ఆదివారం మందులు అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం
చేగుంట, మే23:ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని మక్కరాజిపేట సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, ఎంపీటీసీ బండి కవిత పేర్కొన్నారు. మండల పరిధిలోని మక్కరాజిపేట గ్రామానికి చెందిన తాజొద్దీన్ అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందాడు. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సహకారంతో వచ్చిన రూ.52, 500ల చెక్కును బాధిత కుటుంబానికి ఆదివా రం అందజేశారు. కార్యక్రమంలో ఉప స ర్పంచ్ భాగ్యలక్ష్మి, నాయకులు శంకర్గౌడ్, వార్డు సభ్యులు తదితరులున్నారు.