ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రకియను వేగవంతం చేసింది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా లక్షమందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.3 కోట్ల మందికిపైగా టీకా వేసినట్లు స్పష్టం చేసింది. నిన్న 1,01,098 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశామని, వీరిలో 45 ఏండ్లు పైబడిన 60,938 మంది తొలి డోస్ తీసుకున్నారు. 19,606 మంది ఇతరులు సెకండ్ డోస్ తీసుకున్నారని పేర్కొంది.
అదేవిధంగా బుధవారం 1,616 మంది ఆరోగ్య సహాయకులు తొలి డోస్ వేసుకున్నారు. 2,425 మంది ఇతరులు సెకండ్ డోస్ వేసుకున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న 5,143 మందికి ఇప్పటివరకు వ్యాక్సిన్ వేశామని తెలిపింది. వీరిలో ముంబై నగరం నుంచి 4,048 మంది, థానే నుంచి 620 మంది, రాయ్గఢ్కు నుంచి 449 మంది, నాందేడ్ జిల్లాకు చెందిన 26 మంది ఉన్నట్లు వివరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.