సిటీబ్యూరో,మే 20(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి.. అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్న వారి భరతం పట్టారు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు. స్వయంగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ రంగంలోకి దిగి.. ప్రతి పాసును, వైద్యానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 400 మంది అవసరం లేకుండానే రోడ్లపైకి వచ్చినట్లు గుర్తించారు. మొత్తం రెండు కమిషనరేట్ల పరిధిల్లో సుమారు వెయ్యి వాహనాలను సీజ్ చేశారు.