హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 330 తనిఖీ కేంద్రాల్లో పోలీసులు ఉదయం 10 గంటల తర్వాత తనిఖీలు చేపట్టారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఆస్పత్రుల నుంచి దృవీకరణ పత్రాలు ఉన్న వారికే అనుమతి ఇస్తున్నారు. రాష్ర్టంలో లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే.