మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా అల వైకుంఠపురములో అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు మహేష్ 28వ సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి కొద్దిరోజులుగా అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మహేష్తో చేయబోవు సినిమాలో త్రివిక్రమ్ పాత ఫార్ములాలని ఉపయోగించనున్నాడంటూ కథనాలు వస్తున్నాయి.
త్రివిక్రమ్ గత చిత్రాలు పరిశీలిస్తే.. అందులో కీలకమైన లేడీ పాత్ర ఒకటి ఉంటుంది. ‘అత్తారింటికి దారేది’లో నదియా, ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బు, రీసెంట్ సినిమా ‘అల వైకుంఠపురములో’లో టబు నటించింది. ఇక ఇప్పుడు మహేష్ చిత్రం కోసం శిల్పా శెట్టిని ఎంపిక చేశారని టాక్ నడుస్తుంది. అలానే ‘అల వైకుంఠపురములో..’ యంగ్ హీరో సుశాంత్కు ఓ కీలక పాత్రను ఇచ్చారు. ఇప్పుడు మహేష్ చిత్రంలో సుమంత్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. సుమంత్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, కియారా అద్వాని కథానాయికలుగా నటిస్తారని టాక్.