కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కొందరు త్వరగానే కోలుకుంటుండగా, మరి కొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇంట్లో కరోనో కలకలం సృష్టించింది. బెంగళూరులో ఉంటున్న దీపికా తల్లిదండ్రులు ప్రకాశ్, ఉజ్జలతో పాటు చెల్లెలె అనీషా కూడా కరోనా బారిన పడ్డారు.
దీపికా తండ్రి ప్రకాశ్ లో కరోనా లక్షణాలు ఎక్కువ కనిపించడంతో ఆయనకు ఆసుపత్రిలో తరలించారు. ఉజ్జల, అనీషా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. తాజాగా దీపిక తండ్రికి కరోనా తగ్గిందని ఆయన ఇంటికి వచ్చారని ప్రకాశ్ స్నేహితుడు చెప్పారు. ఇక ఉజ్జల,అనీషాలలో స్వల్ప లక్షణాలు ఉండడంతో వారు కూడా కోలుకున్నట్టు తెలుస్తుంది.