ఘట్కేసర్, మే 12 : ఘట్కేసర్లో బుధవారం అదనపు టీకా కేంద్రాన్ని మున్సిపాలిటీ కార్యాలయం ముం దున్న అంగన్వాడీ కేంద్రంలో చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్యయాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ ప్రజలంతా లాక్డౌన్కు సహకరించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ వసంత,డాక్టర్లు యా దగిరి, కోట్యానాయక్,కౌన్సిలర్లు టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ ఎస్టీ కమ్యూనిటీ హాల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా పంపిణీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకుంటేనే కరోనాను కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. మొదటి డోస్ తీసుకున్న వారు 42 రెండు రోజుల తరువాత రెండో టీకా తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో నారపల్లి దవాఖాన మెడికల్ ఆఫీసర్ యాదగిరి,పోచారం చైర్మన్ కొండల్రెడ్డి, కమిషనర్ సురేశ్,వైస్ చైర్మన్ రెడ్యానాయక్,కోఆష్షన్ సభ్యుడు అక్రం అలీ,టీఆర్ఎస్ నాయకులు క్యాకర్తలు, వైద్య,మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, మే 12 : దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ను మున్సిపల్ కమిషనర్ స్వామి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వైద్యధికారి సరిత, కౌన్సిలర్లు కొత్త సురేఖ, కొత్త హేమలత, ఎం. వెంకటేశ్, వి వెంకటేశ్, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు కొత్త భాస్కర్ గౌడ్, పాండు గౌడ్, కార్తిక్గౌడ్, విజయరాణి, తదితరులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, మే12: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, మేయర్ జక్క వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్ రావు, కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు యుగేంధర్రెడ్డి, హరిశంకర్రెడ్డి, అనంత్రెడ్డి, సుభాష్, బచ్చరాజు, నాయకులు రవీందర్, ఈశ్వర్రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.