హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి కేంద్రం వ్యాక్సినేషన్ డ్రైవ్కు శ్రీకారం చుట్టింది. మూడో దశ వ్యాక్సినేషన్లో 18-44 ఏళ్ల మధ్య వయస్సున వారికి టీకాలు వేస్తుండడంతో కేంద్రం నేరుగా టీకాలు ఉత్పత్తి చేస్తున్న కంపెనీల వద్ద కొనుగోలు చేసుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ టీకాకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి.
ఈ క్రమంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ను 18 రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేస్తున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్కు వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చి కేటాయింపుల ఆధారంగా ఈ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపుతున్నట్లు కంపెనీ ఎండీ సుచిత్రా ఎల్లా ఇటీవల తెలిపారు. ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాను కంపెనీ రాష్ట్రాలకు రూ.400కు సరఫరా చేస్తోంది.