ఆ పద్ధతిలోనే త్వరగా కోలుకుంటారు
పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్
ఐసొలేషన్ సెంటర్ ఆకస్మిక తనిఖీ
కోల్సిటీ, మే 11: కొవిడ్ బారిన పడి అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులకు మందులతోపాటు వైద్య సిబ్బంది మనో ధైర్యం కల్పించే పద్ధతులను అవలంబించాలని పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ సూచించారు. ఈ మేరకు గోదావరిఖని శివారులోని ఎస్డబ్ల్యూఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని మంగళవారం ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య చికిత్స, రోజువారీ భోజనం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు కల్పిస్తున్న వసతులను ఆరా తీశారు. వైరస్తో చికిత్స పొందుతున్న వారిలో ఆత్మైస్థెర్యం పెంపొందించడంతో చాలా త్వరగా కోలుకుంటున్నారని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ కే రమేశ్, ఆర్ఐ ఫకీర్ యాదవ్ తదితరులు ఉన్నారు.
సేవా కార్యక్రమాలు అభినందనీయం
పెద్దపల్లిటౌన్,మే 11: కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న వారికి శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా ట్రస్టు కార్యక్రమాలు అభినందనీ యమని పెద్దపల్లి ఆర్డీవో శంకర్కుమార్ కొనియాడారు. కొవిడ్ పేషెంట్ల కోసం భోజనం అందజేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ దవాఖానలోని ట్రస్టు ఆఫీస్లో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండు పూటలా పౌష్టికాహారంతోపాటు పండ్లు అందజేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకుడు హన్మంతరావు, ఆర్ఐ భవానీప్రసాద్, ఓంకార్, బాషా తదితరులు ఉన్నారు.