ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల తయారీకి చిప్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. ఈ ఏడాది ఎలాంటి గెలాక్సీ ‘నోట్’ స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోమని శాంసంగ్ స్పష్టం చేసింది. 2022లో ఈ ఫోన్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఫోల్డబుల్ ఫోన్ల తయారీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని తెలిపింది.
శాంసంగ్ ఈ ఏడాది ఆగస్టు మధ్యలో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3(Samsung Galaxy Z Fold 3), గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3(Galaxy Z Flip 3) ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. ఈ రెండు మోడళ్లు కూడా గెలాక్సీ ఎస్ 21 FEతో రిలీజ్ కావాల్సి ఉంది. ఆగస్టు 19న గెలాక్సీ ఎస్21 FE విడుదల చేయడానికి శాంసంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.