దుండిగల్, మే 2 : నగర శివారు ప్రగతినగర్ సమీపంలోని మహిళాపారిశ్రామిక వేత్తల సాధికారిక సంస్థ(ఎలీఫ్)లోని సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్మెంట్(సీఈడీ) ఆధ్వర్యంలో వ్యాపార రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ సెక్రెటరీ వై.త్రిపురాంబ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ తరగతులు రెండు వారాల పాటు కొనసాగుతాయని వెల్లడించారు. ఇందులో భాగంగా వ్యాపార రంగం, వాటి ఉత్పత్తులు, నిర్వహణ అనే అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆత్మనిర్భర్ పథకం ద్వారా వివిధ పారిశ్రామిక అవకాశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీలు, పరిశ్రమలను నెలకొల్పే విధానాలపై సవివరంగా తెలియజేస్తామని చెప్పారు. అదే విధంగా ఎంఎస్ఎంఈ, ఎన్ఎస్ఐసీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ప్రాజెక్ట్ రిపోర్ట్లపై క్షుణ్ణంగా వివరిస్తామన్నారు. ఆసక్తి కల్గిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు (మహిళలు, పురుషులు) పూర్తి వివరాల కోసం 7036666423, 8919186385 సంప్రదించాలని తెలిపారు.