హెటిరోకు డీసీజీఐ అనుమతి
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాదీ ఫార్మా దిగ్గజం హెటిరో సంస్థ రష్యా కరోనా టీకా స్పుత్నిక్-వీ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నది. ఇందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. భారత్లో స్పుత్నిక్-వీ తయారీకి హైదరాబాదీ సంస్థలు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హెటిరో సహా మొత్తం ఆరు సంస్థలతో రష్యా ఒప్పందం చేసుకున్నది. ఏటా 85 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్ ఆధ్వర్యంలో ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ సైతం జరుగుతున్నాయి.