విద్యానగర్/గాంధారి/తాడ్వాయి/ఎల్లారెడ్డి/మాచారెడి ,ఏప్రిల్ 28 : కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు ట్యాంకర్తో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. పలు కాలనీల్లో మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. మున్సిపల్ అధికారులు కాలనీల్లో పర్యటించి కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ వాసుదేవారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాసు, ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
గాంధారి మండలంలోని కాయితీ తండాలో సుమారు 30 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో సర్పంచ్ గంగాధర్ తండాలోని అన్ని వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. తండా వాసులు అనవసరంగా బయట తిరగవద్దని, కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.
తాడ్వాయి మండలపరిధిలోని కన్కల్, కరడ్పల్లి, కృష్ణాజివాడి గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు జీపీ కార్మికులతో సోడియం హైపోక్లోరైట్ మందును పిచికారీ చేయించారు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మురికికాలువలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.ఎల్లారెడ్డి, ఏప్రిల్ 28 : ఎల్లారెడ్డి మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో సర్పంచ్ రవీందర్ గౌడ్ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామంలో శానిటైజ్ పనులు చేపట్టినల్లు తెలిపారు. వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది ఉన్నారు.మాచారెడ్డి మండల కేంద్రంలో ఎంపీడీవో బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.