జైపూర్ : జైసల్మీర్ లో మంగళవారం మరణించిన మత పెద్ద మౌలానా ఘజి ఫకీర్ అంత్యక్రియల్లో కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారు. కాంగ్రెస్ నేత, రాజస్ధాన్ మంత్రి సలే మహ్మద్ తండ్రి మౌలానా ఘజి ఫకీర్ అంత్యక్రియల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలో కొవిడ్-19 ప్రొటోకాల్స్ ను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.
పోఖ్రాన్ సమీపంలోని బగు కి ధని వద్ద జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో చాలా మంది మాస్క్ లు లేకుండా కనిపించారు. భౌతిక దూరం నిబంధనలను పాటించకుండా ఒకే చోట గుమికూడారు. మౌలానా ఘజి ఫకీర్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంత్యక్రియల సందర్భంగా కొవిడ్-19 నిబంధనలను పాటించకపోవడం పట్ల నెటిజన్లు తలో రకంగా స్పందించారు.