గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు
ఆసిఫాబాద్, ఏప్రిల్ 26 : సమస్యల పరిష్కారానికి ఆదివాసులు ఐక్యంగా ముందుకు సాగాలని గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని రాయిసెంటర్లో సోమవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూము ల సమస్యల పరిష్కారానికి అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు. రాయి సెంటర్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. 1/70, పెసా చట్టాలున్నప్పటికీ కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇతరులకు చుట్టంగా మారాయని ఆరోపించారు. గిరి వికాసం పథకం ద్వారా అర్హులైన గిరిజనులందరికీ బోరుబావులను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సార్మెడీ కోవ దేవ్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకులు కేశవరావ్, వసంత్రావ్, భీంరావ్, లింగు, మోతీరాం, సంతోష్, సందీప్కుమార్, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.