ముంబై : కొవిడ్ వ్యాక్సిన్పై మహారాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తామని ఆ రాష్ర్ట మంత్రి నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వయసు మధ్య ఉన్న వారందరికీ కరోనా టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలుస్తామని ఆయన చెప్పారు.
ఇక మహారాష్ర్టలో గత వారం రోజుల నుంచి ప్రతి రోజు 60 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా రోజుకు 3 లక్షలపైనే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.