కందుకూరు పోలీసులు సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల రోడ్డుపై తప్పిపోయిన బాలుడిని గుర్తించి చేరదీశారు. పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి.. సాయంత్రంలోపు ఆచూకీ తెలుసుకుని తండ్రి చెంతకు చేర్చారు. అదేవిధంగా గ్రామాలతో పాటు రోడ్లపై గుర్తు తెలియని వ్యక్తులు మాసిన గడ్డం, బట్టలు లేకుండా సంచరిస్తుండగా గమనించిన పోలీసులు చేరదీస్తున్నారు. సెలూన్కు తీసుకువెళ్లి కటింగ్, గడ్డం చేయించి, స్నానం చేయించి నూతన వస్ర్తాలు ఇచ్చి వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. ఏ ఆపదా రాకుండా చూసుకోవాలని ఆశ్రమం నిర్వాహకులకు సూచిస్తున్నారు. అనుక్షణం అండగా ఉంటామని వృద్ధులకు భరోసా కల్పిస్తున్నారు. దీంతో వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మా కడుపున పుట్టిన వారే బుక్కెడు అన్నం పెట్టలేక రోడ్డున పడేస్తున్నారు. దిక్కులేక రోడ్డుపై తిరుగుతున్న మమ్మల్ని గుర్తించిన పోలీసులు కన్న కొడుకుల్లా చేరదీయడం సంతోషంగా ఉంది’ అని వృద్ధులు తెలుపుతున్నారు.
ఎవరూలేని వారిని చేరదీస్తున్నాం. బట్టలు, తిండిలేక అవస్థలు పడుతూ రోడ్లపై తిరుగుతున్న వారిని వృద్ధాశ్రమానికి తరలిస్తున్నాం. తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని సొంతవారి చెంతకు చేర్చుతున్నాం. ప్రజల రక్షణే తమ బాధ్యతగా పనిచేస్తున్నాం.- లిక్కి కృష్ణంరాజు, ఇన్స్పెక్టర్, కందుకూరు