నారాయణపేట, ఏప్రిల్ 17 : కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించి, నిందితులకు సరైన రీతి లో శిక్షలు పడేలా చేసి సకాలంలో బా ధితులకు న్యాయం చేయాలని ఎస్హెచ్వోలు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల్లో పోలీస్ సిబ్బంది, కో ర్టు డ్యూటీ అధికారులతో శనివారం స మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కో ర్టు డ్యూటీ అధికారులు కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్, విచారణ సమర్థవంతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను పాటించడంతోపాటు వాటిని ఉన్నతాధికారులకు చేరవేయడం ద్వారా ఆదేశాల అమలు చేయాలన్నారు. సమాన్లు, ఎన్బీడబ్ల్యూలను సం బంధిత వ్యక్తులకు జారీ చేయడంలో జాప్యం, ని ర్లక్ష్యం చేయరాదని వారు తెలిపారు. కోర్టు ప్రాసిక్యూటర్, కోర్టు సిబ్బందితో మంచి సమన్వయా న్ని కొనసాగించాలన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, గౌరవం పెరుగడానికి కోర్టు డ్యూ టీ అధికారులు తమవంతు పాత్రను పోషించాలన్నారు. కోర్టుల్లోని వివిధ అధికారులను సమన్వయపరుస్తూ సాక్షులు, నిందితులను కోర్టులో హాజరుపరచాలన్నారు. గత వారంలో కోర్టుల్లో జరిగిన కేసుల్లో పడిన శిక్షలు, వీగిపోయిన కేసుల లోపాలను చర్చించి, వాటిపై శిక్షణ తరగతులు నిర్వహించారు.