ముంబై : మహారాష్ర్టలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్నది. రోజురోజుకు కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో.. ఆ రాష్ర్టంలోని ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతోంది. ఉస్మానాబాద్ జిల్లాలో నిన్న ఒక్కరోజే కొత్తగా 681 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు చనిపోయారు. ప్రస్తుతం అక్కడ 4 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఉస్మానాబాద్ జిల్లాలో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. ఆస్పత్రుల్లో రోగులను వీల్ చైర్లపైనే కూర్చొబెట్టి ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో చికిత్స అందిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రోగులందరికీ వైద్యం అందించేందుకు డాక్టర్లు, నర్సులు తమ వంతు కృషి చేస్తున్నారు. మహారాష్ర్టలో నిన్న ఒక్కరోజే 63 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో లాక్డౌన్పై ఆ రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.