హైదరాబాద్ : వనస్థలిపురంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి స్వయంగా వారే వెళ్లినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయిన దృశ్యాలను పోలీసులు సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం నుంచి తమ కుమార్తెలు ఐశ్వర్య (17), ఆస్మా (15), అబీర్ (14) కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థానిక ప్రగతినగర్కు చెందిన రమేశ్, అతడి స్నేహితులపై అనుమానం వ్యక్తం చేశారు. రమేశ్ గతంలో ఐశ్వర్య వెంటపడేవాడని, ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి