కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవాళ కూచ్ బిహార్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కూచ్బిహార్లో తృణమూల్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఒక ప్రచారసభలో మాట్లాడిన మమతాబెనర్జి.. తాము పోలింగ్ ప్రశాంతంగా జరుగాలని కోరుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం ఉండాలని భావిస్తున్నామని చెప్పారు.
సీఆర్పీఎఫ్ జవాన్లు ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి రాకుండా అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని మమత వ్యాఖ్యానించారు. నిజమైన జవాన్లతో కూడిన సీఆర్పీఎఫ్ను తాను ఎంతో గౌరవిస్తానని, కానీ, పోలింగ్ కేంద్రాల దగ్గర హంగామా సృష్టిస్తూ, ప్రజలను హింసిస్తూ, మహిళలపై దాడులకు పాల్పడే బీజేపీ సీఆర్పీఎఫ్ను తాను గౌరవించనని ఆమె వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాతో బ్లడ్ క్లాటింగ్.. 30 మందిలో ఏడుగురు మృతి
సర్పంచ్ అభ్యర్థిగా 81 ఏండ్ల వృద్ధురాలు పోటీ..!
భూమి వైపు దూసుకొస్తున్న మరో ఉల్క
నేడు ప్రధాని ‘పరీక్షా పే చర్చ’
ఏనుగు పిల్లను భుజాలపై మోసుకెళ్లిన ఫారెస్ట్ గార్డ్.. వీడియో వైరల్