వికారాబాద్ జిల్లాలో 292 మందికి, రంగారెడ్డి జిల్లాలో 1,392 మందికి టీకాలు
45 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్
పరిగి, ఏప్రిల్ 4: కరోనా మహమ్మారి నుంచి రక్షణ కో సం టీకా వేసే కార్యక్రమం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సైతం కొనసాగింది. 45 ఏండ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని సర్కారు చేపట్టిం ది. ఇం దులో భాగంగా ప్రతిరోజూ జిల్లాలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలు, జిల్లా దవాఖాన, క్లస్టర్ ఆసుపత్రులలో కొవిడ్ టీకాలు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తాండూరులోని జిల్లా దవాఖాన, పరిగి, వికారాబాద్, కొడంగల్, మోమిన్పేట్లలోని క్లస్టర్ ఆసుపత్రులు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా ప్రభుత్వం టీకాలు వేస్తు ంది. వికారాబాద్లోని మహావీర్ ప్రైవేటు దవాఖానలో టీకాలు వేస్తున్నారు. జిల్లాలో ఆదివారం 292 మందికి వ్యాక్సి న్ వేసినట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్ కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని విస్తృ త పరిచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
టీకా వేయించుకున్న ఎమ్మెల్యే
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదివారం పరిగి పట్టణంలోని సర్కారు దవా ఖానలో టీకా తీసుకున్నారు. అరగంట పర్యవేక్షణ అనంతరం ఆ యనను ఇంటికి పంపించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురవకుండా 45 ఏళ్లు పైబడిన వా రందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. టీకా వేసుకోవడంతోపాటు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచుగా చేతులు శుభ్రపరుచుకోవడం ముఖ్యమన్నారు.
రంగారెడ్డి జిల్లాలో…
షాబాద్, ఏప్రిల్ 4: రంగారెడ్డిజిల్లాలో కొవిడ్ వ్యా క్సినేషన్ కార్యక్రమం చురుకుగా సాగుతున్నది. ఆదివారం జిల్లాలోని 30 కేంద్రాల్లో 1392 మందికి వ్యాక్సిన్ వేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. 45 సంవత్సరాలు పైబడిన వారు టీకా వే యిం చుకుంటున్నారని చెప్పారు. కరోనా వైరస్ నివారణకు ప్రజలందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రభుత్వ దవాఖానల్లో నిరంతరం కొనసాగు తుందని చెప్పారు.