ఇంద్రారెడ్డినగర్ అభివృద్ధికి నింరంతరం కృషి చేస్తాం
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
సీసీరోడ్డు, సంత ప్రారంభం
శంకర్పల్లి, ఏప్రిల్ 4 : మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డినగర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. జడ్పీ నిధులు రూ.35లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.12.25 లక్షలతో ఏర్పాటు చేసిన సంతను ఆదివారం ఆమె ప్రారంభించారు.శంకర్పల్లి మండలం మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డినగర్ గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మిర్జాగూడ గ్రామపరిధిలో జడ్పీ నిధులు రూ.35లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, ఇంద్రారెడ్డినగర్లో రూ.12.25 లక్షలతో నిర్మించిన గ్రామ సంతను ప్రారంభించారు. గ్రామంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ నగర శివారులో ఉన్న ఇంద్రారెడ్డినగర్ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇంద్రారెడ్డినగర్లో నివసించే ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. త్వరలో మిషన్ భగీరథ పనులు ప్రారంభించి అందరికీ తాగునీటిని అందిస్తామన్నారు.
గ్రామంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను త్వరలోనే పరిష్కరించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. జనవాడ, మిర్జాగూడ శివారులో ఉన్న 102 ఎకరాల్లో రెండు గ్రామాల ప్రజలకు ఇండ్ల పట్టాలను అందించామని అన్నారు. ఇండ్ల పట్టాల నివాస స్థలాల వివాద విషయంలో త్వరలో ఆర్డీవోతో పరిష్కారం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డినగర్ ప్రజలు రోడ్లను ఆక్రమించుకొని ఇండ్ల నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు. ప్రభుత్వ స్థలాలను వదిలి తమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ రవీందర్గౌడ్, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, వైస్ ఎంపీపీ రాములమ్మ, ఉప సర్పంచ్ శాంతికిషన్సింగ్, తహసీల్దార్ కృష్ణకుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, రాయదుర్గం పీఏసీఎస్ చైర్మన్ అరవింద్రెడ్డి, శంకర్పల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లేశ్, నాయకులు వెంకటేశ్, నర్సింహగౌడ్, రాజుగౌడ్, అంజయ్య పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి మోకిల సర్పంచ్ మోహన్రెడ్డి తల్లి ఇటీవల మృతిచెందగా ఆయనను కలిసి పరామర్శించారు.
క్రీడలతో స్నేహభావం
క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని మంత్రి అన్నారు. మండలంలోని జనవాడ గ్రామ శివారులో జరుగుతున్న జేఎంపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఇంద్రారెడ్డి జనవాడ, మిర్జాగూడ గ్రామ ప్రజలతో ఎంతో అన్యోన్యంగా ఉండేవారని గుర్తు చేశారు. అన్నదమ్ముల వలె రెండు గ్రామాల ప్రజలు కలిసిమెలసి ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నాగేందర్, మండల మాజీ అధ్యక్షుడు నర్సింహ, మండల కోశాధికారి పాల్గొన్నారు
ఇవి కూడా చదవండి
ముద్దు కోసం తండ్రి అనుమతి తీసుకున్న ప్రభాస్
డబ్బింగ్ మొదలు పెట్టిన పెళ్లికొడుకు..
హీరో సంచలనం.. ఎలక్ట్రిక్ వెహికల్స్పై మెకానిక్లకు శిక్షణ