ఐనవోలు, మార్చి 30 : ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీ, టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవా రం లెక్కించినట్లు ఆలయ ఈవో నాగేశ్వర్రావు తెలిపారు. 33 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.32,98,006, టికెట్ల ద్వారా 82,58,412 మొత్తం రూ.1,15,56,418 ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ పరిశీలకుడు అనిల్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ సంపత్కుమార్, ధర్మకర్తలు రాజు, వెంకట్రెడ్డి, ప్రతాప్రెడ్డి, ఉప్పలయ్య, సతీశ్, దేవేంద్ర, కుమారస్వామి, శ్రీ వెంకటేశ్వర సేవా సమితి మహబూబాబాద్ సభ్యులు, ఆలయ సిబ్బంది కిరణ్, మధుకర్, శ్రీకాంత్, రాజు, సమ్మయ్య, రాజు, కానిస్టేబుల్ రమేశ్ పాల్గొన్నారు.
కురవి ఆదాయం రూ.45.48 లక్షలు
కురవి, మార్చి 30 : కురవి మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించినట్లు కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ తెలిపారు. డిసెంబర్ 22 నుంచి మార్చి 29 వరకు 99 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించినట్లు తెలిపారు. స్వామివారి ఆదాయం రూ. 35,14,748, అమ్మవారి ఆదాయం రూ.10,33,305 కలిపి మొత్తం రూ.45,48,053 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. దేవాదాయ ఇన్స్పెక్టర్ పారుపెల్లి కవిత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బదావత్ రామూనాయక్, ధర్మకర్తలు మల్లయ్య, లక్ష్మీరాజు, కురవి ఎస్సై శంకర్రావు, శ్రీలక్ష్మీగణపతి సేవా ట్రస్టు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.