డిజైన్లు పూర్తయిన వెంటనే కాలువల నిర్మాణం
కెనాల్స్పై సీఎం కేసీఆర్దే తుది నిర్ణయం
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
రాజధాని జలసౌధలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష
మహబూబ్నగర్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయ ని.. సీఎం కేసీఆర్ పరిశీలించిన తరువాత సాధ్యమైనంత త్వరగా తుది డిజైన్లు పూర్తి చేసి కాలువ నిర్మాణ పనులు చేపడతామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్లోని జలసౌధలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డితో కలిసి ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీఆర్ఎల్ఐలో భాగంగా కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల పనులు పూర్తయిన వెంటనే మహబూబ్నగర్ పార్లమెంట్ ని యోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని భూములకు సాగునీరందించేందుకు కాలువలు సిద్ధం చేసి ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్, షాద్నగర్ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో సాగునీరు పారేందుకు కాలువలు తవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు సూచించిన కాలువల డిజైన్లపై మంత్రి పరిశీలించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సూచనలు, సలహాలు చేశారు. కాలువ నిర్మాణ పనుల డిజైన్లపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని, ఆ వెంటనే టెండర్ల పక్రియ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి మొదలుకొని షాద్నగర్ వరకు కాలువల ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్రావు, సీఈలు శ్రీనివాస్, రమేశ్, ఎస్ ఈ శ్రీనివాస్, ఏఎస్ఎన్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలు ఐకమత్యంతో జీవించాలి
కుల, మ త రాజకీయాలు చేయకుండా ప్రజలు ఐకమత్యంతో జీవించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. జిల్లాలో ఎప్పటికప్పుడు పోలీస్ నిఘా ఉంటుందని ఆయనన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని హజ్రత్ భగ్మర్ సాబ్ దర్గా ఆవరణలో రూ.25 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అందరూ ఐకమత్యంతో జీవించాలని ఆయన కోరారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి త న వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నా రు. గతంలో దర్గా అభివృద్ధి గురించి ఎవరూ ప ట్టించుకోలేదన్నారు. ఇప్పడు రూ.25 లక్షలతో క మ్యూనిటీ హాల్ నిర్మించామని, పూజలు చేసుకోవడంతోపాటు మొక్కులు తీర్చుకునే భక్తులు బస కూడా చేయవచ్చని సూచించారు. మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు నాలుగు లేన్ల రహదారి మంజూరైందని తెలిపారు. అంతకుముందు దర్గాలో మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్,, కౌన్సిలర్లు షబ్బీర్ అహ్మద్, షేక్ఉమర్, మోయిన్అలీ, మునీర్, ము న్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అర్షద్అలీ, మైనార్టీ నాయకులు ఇఫ్తెకార్ అహ్మద్, అన్వర్పాషా, మో సీన్, జావిద్బేగ్, రాశద్, అంజద్, హఫీజ్ ఇద్రీస్, దర్గా ప్రతినిధులు పాల్గొన్నారు.
మీ సహకారం మరువలేనిది..
ఉద్యమకారుడిగా.. ఉద్యోగ సంఘం నేతగా.. మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి సావధానంగా వివరించడంతోపాటు వాటి పరిష్కారంలో ముందున్న మీకు ఎవరూ సాటిలేరంటూ మంత్రి శ్రీనివాస్గౌడ్ను టీఎన్జీవోస్ నేతలు ప్రశంసించారు. జిల్లా కేం ద్రంలోని తన నివాసంలో వారు గజమాలతో మంత్రిని ఘనంగా సన్మానించారు. మిఠాయిలు తినిపించి ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మంత్రికి కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ జి ల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రనాయాక్, సంఘం నేతలు డాక్టర్ కృష్ణమోహన్, దామోదర్, చంద్రశేఖర్, స్వప్నరాణి, బాబురావు, సంతోశ్, రాధాకృష్ణ, చిన్నయ్యనాయక్, జ్యోతి, మాధవి, యశోద, నరేందర్రెడ్డి, రవీందర్, శివకుమార్, విష్ణు పాల్గొన్నారు.
బీమాతో రైతు కుటుంబాలకు ధీమా
రైతులకు మంచి చేయాలనే తపనతోనే రైతుబీమాను కొనసాగిస్తున్నట్లు, అందుకే రైతు కుటుంబాలకు అండగా నిలిచిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రం లో దొడ్డలోనిపల్లికి చెందిన రైతులు చెంచుపల్లి లా లయ్య, ముష్టిపల్లి మాసమ్మలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షలను రైతు బీమా చె క్కులను మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. రైతులకు మంచి చేయాలనే తపనతో కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
Indian Railway | రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. మీ ఫోన్లకు చార్జింగ్ పెట్టలేరిక!
1.82 కోట్ల ఎల్ఐసీ నిధులు గోల్మాల్!
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల