పుణె: టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 6వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో భారత ఆటగాడిగా గబ్బర్ నిలువనున్నాడు. ఈ ఫీట్ సాధించడానికి శిఖర్ ధావన్ మరో 94 పరుగులు చేయాల్సి ఉంది. 35ఏండ్ల శిఖర్ 137 వన్డే ఇన్నింగ్స్ల్లో 5,906 పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 31 అర్ధశతకాలు ఉన్నాయి. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో ధావన్ 98 పరుగులు చేసిన విషయం తెలిసిందే. మిగతా రెండు వన్డేల్లోనూ చెలరేగి 6వేల పరుగుల మార్క్ అందుకోవాలని ధావన్ ఆసక్తిగా ఉన్నాడు.
హషీమ్ ఆమ్లా-123 ఇన్నింగ్స్లు
విరాట్ కోహ్లీ-136 ఇన్నింగ్స్లు
కేన్ విలియమ్సన్-139 ఇన్నింగ్స్లు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రెండో వన్డే ఆడే తుది జట్టు ఇదే!
త్వరలోనే ఇండియా, పాకిస్థాన్ టీ20 సిరీస్!