హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఇద్దరు మరణించారు. నిన్న మరో 189 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2607 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 980 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,724కు చేరింది. ఇందులో 2,98,451 మంది కోలుకోగా, 1668 మంది మరణించారు. రికవరీ రేటు 98.58 శాతం, మరణాల రేటు 0.55 శాతంగా ఉన్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 75 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 66,036 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. నిన్న 21,477 మందికి తొలి డోస్, 732 మందికి వ్యాక్సిన్ రెండో డోస్ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 6,79,928 మంది మొదటి డోసు, 2,17,759 మంది రెండో డోస్ టీకాలు తీసుకున్నారు.