నల్లగొండ: వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 71 మందిలో 67 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయ్యింది. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 6546 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో కొనసాగుతున్న తీన్మార్ మల్లన్నకు 8565, ప్రొఫెసర్ కోందడరామ్కు 9038 ఓట్ల చొప్పున వచ్చాయి. ఎలిమినేషన్ ఓట్లతో సమీప ప్రత్యర్థి మల్లన్నపై పల్లా రాజేశ్వర్ రెడ్డి 25,528 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్కు 1,17,386 ఓట్లు వచ్చాయి. ఇక ప్రొఫెసర్ కోదండరామ్కు 79,110 ఓట్లు, బీజేపీకి 42,015, కాంగ్రెస్కు 30,358 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు కావాల్సి ఉంటుంది.