హైదరాబాద్ : నగరంలోని బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో బీహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జీఎస్టీ అమలుతీరుపై సీఎస్ అధికారులకు వివరించారు. సీఎం కేసీఆర్ మార్గ నిర్ధేశకత్వంలో ట్యాక్స్ బేస్లో గణనీయమైన పురోగతిని సాధించడం వలన గత ఐదేండ్లలో కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూను రెట్టింపు చేయడం సాధ్యమైందన్నారు.
2018, 2020లో రెండుసార్లు వాణిజ్య పన్నులశాఖను హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్ధీకరణ చేయడం జరిగిందన్నారు. ఆర్ధిక వ్యవస్ధలోని ముఖ్యమైన రంగాలలో విశ్లేషణ, పరిశోధన, రెవెన్యూ పొటెన్షియల్ ఉన్న ఏరియాల గుర్తింపు కోసం శాఖలో ఎకనామిక్ ఇంటలిజెన్స్ వింగ్ను ఏర్పాటు చేశామన్నారు. వాణిజ్య పన్నులశాఖలో టెక్నాలజీ వినియోగం, యాప్స్, డేటా అనలిటిక్స్ ద్వారా ట్యాక్స్ అడ్మినిస్ర్టేషన్ సిస్టం ఇండివిజువల్ బేస్ నుండి సిస్టం డ్రివెన్ ట్యాక్స్ అడ్మినిస్ర్టేషన్గా మార్పు చెంది రెవెన్యూ రియలైజేషన్ లక్ష్యాలను సాధించడం జరిగిందని సీఎస్ వివరించారు. ఈ సమావేశంలో ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ హర్ప్రీత్ సింగ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ నీతూప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.