హైదరాబాద్ : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని పలు అంశాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రుల నివాసంలో చర్చించారు. బడ్జెట్, పెండింగ్ అంశాలు, నడుస్తున్న పనులు, ఆయా పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలనే పలు అంశాలను మంత్రి అధికారులతో చర్చించారు. ఆయా పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు తదితరులుపాల్గొన్నారు.