దండేపల్లి, మార్చి 15 : గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు, ఆర్థిక సాధికారత సాధించేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సర్కారు స్వ యం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)లను ఏర్పాటు చే సింది. ఓటరు జాబితా ఆధారంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 18-58 ఏండ్ల వయస్సు గల వారిని సభ్యులుగా చేర్చారు. ప్రతి గ్రూపులో కూడా 10-12 మంది సభ్యులు సంఘంగా ఏర్పడి పొదుపు బాట పట్టారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 8,755 గ్రూపులు ఉండగా.. 99,813 మం ది సభ్యులు ఉన్నారు. వీటిలో అనివార్య కారణాల వల్ల ఖా ళీ ఏర్పడిన వారిని కూడా భర్తీ చేశారు. 485 గ్రూపుల్లో 907 మందిని సభ్యులుగా చేర్చారు.
కొత్తగా ఏర్పాటైన గ్రూపు పేరిట ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరుస్తారు. మహిళా సంఘాలు క్రమం తప్పకుండా పొదు పు సొమ్ము బ్యాంకుల్లో జమ చేస్తే లక్షల్లో రుణం పొందే అవకాశం ఉంది. తొలిసారిగా ప్రతి సంఘానికి రూ. 75వేలు ఇస్తారు. దీనిని క్రమం తప్పకుండా చెల్లిస్తే రూ.5 లక్షల వరకు మంజూరవుతాయి. పొదుపు సంఘాల్లో ఉ న్న సభ్యులు ప్రతి నెలా రూ.100 చొప్పున ఆరేళ్లపాటు రూ.7,200 చెల్లించి శ్రీనిధి రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికి నెలనెలా వడ్డీ వస్తుంది. ఈ నిధి నుంచి అత్యవసరాలకు రుణం తీసుకోవచ్చు. ఒక స భ్యురాలికి రూ.25 వేల వరకు గరిష్ఠంగా మంజూరు చేస్తారు. ఇవీ 13 శాతం వడ్డీతో 24 కిస్తీల్లో చెల్లించాలి. కాగా.. చా లా మంది మహిళలు రుణాలు తీసుకొని స్వయం ఉపాధి కి బాటలు వేసుకుంటున్నారు. కొందరు మహిళలు సమష్టిగా ఏర్పడి కుటీర పరిశ్రమలు స్థాపిస్తున్నారు. మరి కొందరు పేపర్ గ్లాస్, ప్లేట్ల తయారీ చేస్తూ.. దుస్తులు, బేక రీ దుకాణాలు నిర్వహిస్తూ.. గేదెలు, మేకలు పెంచుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
స్వయం సహాయక సంఘాల్లో మరికొందరు మహిళలకు అ వకాశం కల్పించాలని సర్కారు సంకల్పించింది. ఈ మేరకు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు బాధ్యతలు అప్పగించారు వీరు డిసెంబర్ 5, 2020 నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితా ఆధారంగా 18 ఏండ్లు దాటిన మహిళలను గుర్తించి పది మందికి ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ 1,441 సంఘాలు ఏర్పాటు చేయగా.. 14,433 మంది సభ్యులుగా చేరారు. ఇంకా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారుల సహకారంతో నూతన గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. ఎంపిక ప్రక్రియ ఈ నెల చివరి వరకు కొనసాగనున్నది. కొత్తగా ఏర్పాటైన గ్రూపు సభ్యులకు పొదుపు, ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేందుకు వ్యాపార కార్యకలాపాల ఏర్పాటు, దస్ర్తాల నిర్వహణ, బ్యాంకు లింకేజీ రుణాలు, నాయకత్వం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ నెలాఖరు వరకు కొనసాగనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పడ్డ సంఘాలపై ఆరు నెలలపాటు ఏపీఎంల పర్యవేక్షణ ఉంటుంది.