హైదరాబాద్: మాస్క్లు ధరించకున్నా.. సోషల్ డిస్టాన్సింగ్ నియమావళిని ఉల్లంఘించినా.. అలాంటి ప్రయాణికులపై నిషేధం విధించేందుకు డీజీసీఏ సిద్దమైంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రయాణికులను నో ఫ్లై జాబితాలో చేర్చనున్నట్లు చెప్పింది. అలాంటి వారిపై మూడు నెలల లేదా రెండు ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు విమాన ప్రయాణాలపై నిషేధం విధించనున్నట్లు డీజీసీఏ తన తాజా ఆదేశాల్లో పేర్కొన్నది. ఒకవేళ ప్రయాణికులు ఎవరైనా విమానం ఎక్కడానికి ముందే ఆంక్షలను విస్మరిస్తే వారిని డీబోర్డ్ చేయాలంటూ కూడా డీజీసీఏ ఆదేశించింది.