ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు
వీణవంకలో సీఎం కేసీఆర్, అంబేద్కర్ చిత్రపటాలకు పాలాభిషేకం
దళితబంధు పథకంపై భారీ సంబురాలు
వీణవంక, జూలై 19: రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవం దళితబంధు పథకమని, పేదల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఆయా గ్రామాలతోపాటు వీణవంకలోని బస్టాండ్ ఆవరణలో దళితబంధు పథకం అమలుపై కదిలివచ్చి దళిత నాయకులు, టీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మాట్లాడారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తున్నారని, పేదల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. దళితులకు శాశ్వత భరోసా కల్పించేందుకు దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిందేమీలేదని, ఆయన నిర్లక్ష్యంతో ప్రజలకు తీవ్రనష్టం వాటిల్లిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రగతి పనులు శరవేగంగా జరుగుతుంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో పనులు ఎక్కడవేసిన గొంగడిలా ఉండడానికి కారణం ఈటల కాదా అని మండిపడ్డారు.
పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను ఆశీర్వదించి రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి మదన్కుమార్ ముదిరాజ్, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రభాకర్, సర్పంచులు రఘుపాల్రెడ్డి, పోతుల నర్సయ్య, కోమాల్రెడ్డి, పోతిరెడ్డిపల్లి అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు గజ్జెల శ్రీకాంత్, నాయకులు జడల రమేశ్, గంగాడి తిరుపతిరెడ్డి, జీడి దేవయ్య, నాగిడి సంజీవరెడ్డి, తాండ్ర శంకర్, గాజుల రవి, తిరుపతి, రమేశ్, రాజేశ్, కుమార్, సమ్మయ్య పాల్గొన్నారు.