రైతులకు పూర్వ వైభవం
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు
బోయినపల్లి, జూలై 14: రైతులందరికీ సరిపడా సాగు నీటిని ప్రభుత్వం అందిస్తున్నదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. బుధవారం బోయినపల్లి మండలం కొదురుపాక హైలెవల్ వంతెన వద్ద ఎస్ఆర్ఆర్ జలాశయం నీటిని పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం చివరి మడికి వరకు సాగుకు నీటి సరఫరా చేయనున్నదని చెప్పారు. సమైక్య పాలనలో వలస వెళ్లిన రైతులు ఇప్పుడు స్వగ్రామాల్లో చక్కగా వ్యవసాయ చేసుకుంటూ కుటుంబీకులతో కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. రైతులకు ఇప్పుడు పూర్వ వైభవం వచ్చిందని వారి ఇంట సిరుల పంట పండుతున్నదన్నారు. యేటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నదని తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు కొండయ్య, తదితరులున్నారు.
రక్షణ చర్యల పనుల కోసం వంతెన పరిశీలన
బోయినపల్లి, జూలై 14: బోయినపల్లి మండలం కొదురుపాక హైలెవల్ వంతెన వద్ద రక్షణ చర్యల పనులు చేపట్టేందుకు హైలెవల్ వంతెనను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీటి పారుదల శాఖ డీఈఈ సురేశ్బాబు పరిశీలించారు. కొదురుపాక హైలెవల్ వంతెన పై నుంచి కొందరు ఆత్మహత్యకు పాల్పడగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు రక్షణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిచింది. టెండర్లు పూర్తి కాగా వంతెన రెండు వైపులా, మధ్యలో ఉన్న డివైడర్ పైన జాలిని అమర్చనున్నారు. బుధవారం వంతెన, డివైడర్ను వారు పరిశీలించారు. వారి వెంట ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, అనుముల భాస్కర్ ఉన్నారు.