సిరిసిల్ల టౌన్, జూలై 11: వర్షపు నీటితో ముంపునకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించామని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. ఆదివారం భారీగా కురిసిన వర్షంతో స్థానిక 34,35,37,38 వార్డుల్లోని పలు ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరగా కమిషనర్తో కలిసి ఆమె పరిశీలించారు. వర్షం కురిసిన ప్రతిసారి మురుగు కాలువలు సరిగా లేక నీరు రోడ్లపై నిలువడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి చేరుతున్నట్లు గుర్తించామన్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణాభివృద్ధికి రూ.15కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు. స్థానికంగా ప్రధాన మురుగు కాలువ శిథిలావ్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ.6కోట్లు నిధులు కేటాయించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. త్వరలోనే నూతన కాలువ నిర్మాణ పనులను ప్రారంభించి భవిష్యత్లో సమ స్య పునరావృతం కాకుండా చర్యలు వేగవంతం చేస్తామన్నారు. ప్రజలు డ్రైనేజీల్లో ఎలాంటి వ్యర్థాలను పడవేయకూడదని సూచించారు. ఆమె వెంట కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు దార్ల కీర్తన, దూస వినయ్, దిడ్డి మాధవి, గూడూరి భాస్కర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పరిశుభ్రతకు పది నిమిషాలు..
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వానకాలంలో సీజనల్ వ్యాధుల నిర్మూలనలో భాగంగా ప్రతి ఆదివారం 10గంటలకు 10నిమిషాలు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తెలిపారు. 3వ వార్డు పరిధిలో ఇంటింటికీ వెళ్లి సీజనల్ వ్యాధుల నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. టీపీఎస్ వినయ్ తదితరులున్నారు.