నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
సముద్రలింగాపూర్, రాజుపేటలో ఏర్పాట్ల పరిశీలన
గంభీరావుపేట, జూన్ 30: పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ గురువారం మండలానికి వస్తున్నారని, అమాత్యుడి పర్యటనను విజయవంతం చేద్దామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. రాజుపేట, సముద్రలింగాపూర్లో మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి, సామూహిక గొర్రెల షెడ్లను మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఆయన వెంట డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మం డలాధ్యక్షుడు మోతె రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామంజగౌడ్, ఏఎంసీ చైర్మన్ దయాకర్రావు, ఉప సర్పంచ్ దేవేందర్, నేతలు వంగ సురేందర్రెడ్డి, గౌరినేని నారాయణరావు, సదాశివారెడ్డి, కమ్మరి రాజారాం, ఎల్లాగౌడ్, శేఖర్గౌడ్, స్వామి, లక్ష్మీనర్సు ఉన్నారు.
సాగు సాఫీగా సాగాలి
వానకాలం సాగు సాఫీగా సాగాల ని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విత్త నాలు, ఎరువులు అందుబాటులో ఉం చామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రా వు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాల యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత యాసంగి సాగు గణనీయంగా పెరిగిం దని తెలిపారు. జిల్లాలో 12లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగు బడి వచ్చిందన్నారు. గోదాముల్లో విత్తనాలు, ఎరువు లను అందుబాటులో ఉంచామన్నారు. మంత్రి కేటీఆర్ ప్రేరణతో యువత వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. పంటల ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధం గా సహకార సంఘాలు బహుముఖ సేవలందిస్తూ, రైతు లకు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. సహకార సంఘా లను మరింత బలోపేతం చేసి, రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించా రు. గంభీరావుపేట సింగిల్విండో పరిధిలో సుమారు 2వేల ఎరువుల బస్తాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో కొత్తపల్లి పీఏసీఎస్ చైర్మన్ భూపతి సురేం దర్, ఏఎంసీ మాజీ చైర్మన్ దయాకర్రావు, డైరెక్టర్లు, తదిత రులు పాల్గొన్నారు.