కలెక్టర్తో సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్
ఫర్టిలైజర్సిటీ, మే 31: రామగుండం ఎరువుల కర్మాగారంలో యాజమాన్యం ఇండస్ట్రియల్ నియమ, నిబంధనలు పాటించేలా చూడాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈమేరకు ఆయన కలెక్టర్తో పెద్దపల్లిలో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఎరువుల ఉత్పత్తి సమయంలో అమ్మోనియా లీక్ అవుతున్నదని వివరించారు. దీంతోప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు. ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీతో ఎవరైనా అస్వస్థతకు గురైతే చికిత్స అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేవన్నారు. సుందిళ్ల బ్యారేజీ బ్యాక్ వాటర్, మల్కాపూర్ ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మేయర్ అనిల్ కుమార్ తదితరులున్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
జ్యోతినగర్, మే 31: రామగుండం 39వ డివిజన్లోని శాంతినగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. కాలనీలో శాంతినగర్ అభివృద్ధి కమిటీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడ నాయకులు జెట్టి రమేశ్, శాంతినగర్ అభివృద్ధి కమిటీ బాధ్యులు నల్ల ప్రణీత్బాబు, ప్రభంజన్రెడ్డి, కేవీ రావు, జగదీశ్వర్రెడ్డి ఉన్నారు.