Pooja Hegde : తెలుగు ప్రేక్షకులకు బుట్టబొమ్మగా గుర్తుండిపోయే నటి పూజా హెగ్డే. నాగ చైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. బాలీవుడ్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా చేతిలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన రాధేశ్యామ్లో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్తో పాటు చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్తో కలిసి గెస్ట్ రోల్ లో కనిపించబోతోంది.