ఆది సాయికుమార్, సురభి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం శశి. శ్రీనివాస్నాయుడు నడికట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి యువ కథానాయకులు రానా దగ్గుబాటి, నాగ శౌర్య, సందీప్ కిషన్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.