అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన తల్లిలా బాలీవుడ్లో సత్తా చాటేందుందుకు ప్రయత్నిస్తోంది. ధడఖ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. అటు సినిమాలతోనే కాకుండా గ్లామర్ ఫొటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తనకి సంబంధించిన హాట్ ఫొటోలను జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్గానూ మారుతున్నాయి. తాజాగా బీచ్లో దిగిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.