ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు హీరోలు. ఇప్పుడు హీరో కార్తికేయ కూడా ఇదే చేశాడు. ఈయన నటించిన ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గీతాఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాకు ప్రమోషన్ కూడా అలాగే చేస్తారు.
ఇప్పుడు ‘చావు కబురు చల్లగా’ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. విడుదలకు పది రోజుల ముందు నుంచి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా కాకినాడ వెళ్లిన చిత్ర యూనిట్ అక్కడ ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లి డ్యాన్స్ చేశారు.
అక్కడ పద్మప్రియ థియేటర్కు వెళ్లిన కార్తికేయ, లావణ్య త్రిపాఠి ఆడియన్స్తో కలిసిపోయారు. తమ సినిమా ముచ్చట్లు వాళ్లతో పంచుకున్నారు. అంతేకాదు ఈ ప్రమోషన్లు టిక్ టాక్ దుర్గారావు కూడా ఉన్నాడు. చావు కబురు చల్లగా హీరో కార్తికేయతో కలిసి రోడ్డుపై డాన్సులు చేశాడు దుర్గారావు. తన సినిమా ప్రమోషన్ కోసం కార్తికేయ కూడా అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఈ సినిమాలో బస్తీ బాలరాజు అనే మాస్ క్యారెక్టర్లో నటించాడు కార్తికేయ.
తాజాగా విడుదలైన ప్రోమో సాంగ్లో మామూలు మాస్ డాన్స్ చేయలేదు. కచ్చితంగా చావు కబురు చల్లగా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాగా చెబుతున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 తర్వాత తన కెరీర్లో దాన్ని మరిపించే హిట్టవుతుందని చెప్తున్నాడు ఈ హీరో. చేస్తున్న ప్రమోషన్ చూస్తుంటే సినిమాలో విషయం కూడా గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతోంది. కొత్త దర్శకుడు కౌశిక్ ఈ సినిమాను తెరకెక్కించాడు.