దేశముదురు సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది హన్సిక. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రభాస్తో నటించే అవకాశాన్ని కూడా కొట్టేసింది. కానీ అవేవీ టాలీవుడ్లో సెటిల్ అవ్వడానికి ప్లస్ కాలేదు. దీంతో కోలీవుడ్కే పరిమితమైన హన్సిక.. అక్కడ స్టార్ హీరోయిన్గా మారింది. తమిళనాట ఈమెకు అభిమానులు గుడి కూడా కట్టేశారు. హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన టాలీవుడ్లో ఆడపాదడపా సినిమాలు చేసినా అవేవీ విజయాన్ని అందుకోలేకపోయాయి. తెలుగులో చివరిసారిగా సందీప్ కిషన్తో కలిసి తెనాలి రామకృష్ణలో నటించింది. 2019లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్నే సొంతం చేసుకుంది. దీంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీపై కన్నేసింది హన్సిక. ఇప్పుడు మై నేమ్ ఈజ్ శృతి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.. ఈ సినిమాను ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని హన్సిక స్టిల్స్ మీకోసం..